Alert : ఈ నెల 30 లేదా మే 1న తెలంగాణ పదోతరగతి ఫలితాలు

-

తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, పదో తరగతి ఫలితాల విడుదల తేదీలను ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు పదో తరగతి ఫలితాలు ఈనెల 30వ తేదీ లేదా మే 1వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. 5,08,385 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దానికి సంబంధించిన మూల్యాంకనం శనివారం పూర్తి కావడంతో వారం రోజులపాటు ఫలితాల డీ కోడింగ్‌ చేస్తారు. అనంతరం ఈనెల 30వ తేదీ  లేదా వచ్చే నెల 1వ తేదీ ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news