భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ అంజన్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ అంజన్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ సామాన్య ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల ఎస్.పి లు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ నేడు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య పర్చాలని సూచించారు.

రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖ నుండి ప్రజలు తగు సహాయ సహకారాలకై ఎదురుచూస్తారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తమ నాయకత్వ ప్రతిభను చూపించి ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీజీపీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి తో మాట్లడి పరిస్థితిని సమీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news