తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

-

తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం చలికి గజగజ వణుకుతోంది. కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురువారాల్లో కూడా చలి తీవ్రత కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యల్పంగా రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.. మెదక్‌లో 12.8, పటాన్‌చెరు 13.2, ఆదిలాబాద్‌ 13.7, హకీంపేట 14.5, రామగుండం 14.6, హనుమకొండ 15, దుండిగల్‌ 15.7, నిజామాబాద్‌ 16.5, హయత్‌నగర్‌ 16.6, హైదరాబాద్‌ 16.6, ఖమ్మం 17, నల్గొండ 17.4, భద్రాచలం 18, మహబూబ్‌నగర్‌లో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.

వాతావరణ శాఖ ప్రకటనతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. వీలైనంత వరకు ఉదయం 7 గంటల లోపు బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెప్పారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే స్వెటర్, మఫ్లర్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ముఖ్యంగా చెవులకు ఏదైనా వస్త్రం ధరించడం తప్పనిసరి అని చెప్పారు. వీలైతే మాస్కు ధరించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news