తెలంగాణ ప్రజలకు అలర్ట్..నేటి నుంచి 5 రోజల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

-

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి వాతావరణమున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడ్డాయి. మరికొన్ని ప్రాంతాలలో వడగండ్ల వానలు కూడా పడ్డాయి. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి ఐదు రోజులపాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news