తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. తన కూతురిని ప్రేమించాడని.. ఓ కుర్రాడిని గొడ్డలితో నరికాడు యువతి తండ్రి. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో చోటుచేసుకుంది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎలివేడు మండలం ముప్పిరి తోటకు చెందిన పూరెల్ల సాయికుమార్ అనే వ్యక్తి… అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పూరెల్ల సాయికుమార్ వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో యువతి తండ్రి ఆగ్రహించాడు. తన బంధువులతో కలిసి పూరెల్ల సాయికుమార్ పై దాడి చేసి… గొడ్డలితో నరికేశాడు యువతి తండ్రి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పెద్దపల్లి జిల్లా పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.
మరో పరువు హత్య…!
తన కూతురిని ప్రేమించాడని పూరెల్ల సాయికుమార్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపిన యువతి తండ్రి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోట గ్రామంలో ఘటన pic.twitter.com/xSMRosTfqp
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2025