మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా…కేటీఆర్‌ కీలక ప్రకటన

-

మహబూబ్ నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగిరింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్… సీఎం రేవంత్‌ సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు..తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు కాబోతుందన్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు.

ktr about Telangana decade

పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు.. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచింది….ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయం అన్నారు. ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిది…నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news