జగన్ – షర్మిల మధ్య ఆస్తుల పంపకం కానట్టుంది – జగ్గారెడ్డి

-

గత రెండు రోజులుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా నేడు మరోసారి షర్మిలపై మండిపడ్డారు జగ్గారెడ్డి. షర్మిల పాదయాత్ర కాదు.. కాళ్లు, చేతులు కొట్టుకున్న తెలంగాణలో గెలవలేదని అన్నారు.

తెలంగాణలో టిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని.. ఎలా ముందుకు వెళ్లాలి అనేది బిజెపికే అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణలో అనవసర న్యూసెన్స్ చేస్తుందని మండిపడ్డారు. అమ్మాయి కదా అని ఏం అనలేకపోతున్నామని.. మళ్లీ మా నాయకుడు వైయస్ బిడ్డ కదా అని ఆలోచన చేస్తున్నామన్నారు. షర్మిల తనని కేటీఆర్ కోవర్ట్ అంటుందని.. తనకి అసలు కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకదు అన్నారు.

నేను అన్ని మతాలకు సమన్వయకర్తను అన్నారు జగ్గారెడ్డి. షర్మిల లాగా బిజెపికి ఏజెంట్ ని కాదని విమర్శించారు. తనని ఇలాగే రెచ్చగొడితే మాత్రం చాలా విషయాలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ – షర్మిల మధ్య ఆస్తుల పంపకం కూడా ఇంకా కానట్టుందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news