ఇవాళ మహబూబ్ నగర్ కు ప్రధాని మోడీ… షెడ్యూల్ ఇదే

-

నేడు తెలంగాణలోని మహబూబ్ నగర్ కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు పర్యటన వివరాలు రిలీజ్‌ చేశారు అధికారులు. ఇక షెడ్యూల్‌ ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి మోడీ రానున్నారు. 1:35కి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌ కి మోడీ రానున్నారు.

This is the schedule of Prime Minister Modi for Mahbubnagar today
This is the schedule of Prime Minister Modi for Mahbubnagar today

మధ్యాహ్నం 2:05 గంటలకు పాలమూరుకు ప్రధాని చేరుకుంటారు. 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు పాలమూరు ప్రజా గర్జన పేరిట బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. సభ అనంతరం హెలికాప్టర్‌లో సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్‌ కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రధాని నరేంద్ర మోడీ పయనం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news