BREAKING : సూర్యాపేటలో క్వారీ గుంతలో పడి ముగ్గురి మృతి

-

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆత్మకూరు (ఎస్‌) మండలం బొప్పారంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపాల్‌ రెడ్డి, రాజు స్నేహితులు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్‌ రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం రోజున బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ తమ కుటుంబాలతో హాజరయ్యారు. అక్కడ సందడిగా గడిపిన వారు ఇవాళ ఉదయం తన కుమార్తె (12) క్వారీ చూడాలని ఉందంటే ఆమెను తీసుకుని అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్‌ రెడ్డి అందులోకి దిగగా.. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news