తెలంగాణ ఆర్టీసీ టికెట్‌తో తిరుమల శ్రీవారి దర్శనం

-

తెలంగాణ ఆర్టీసీ టికెట్‌తో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతికి టిఎస్ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేవారు తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని సంస్థ చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులు నడుపుతోందని, ప్రతిరోజు వెయ్యి మంది ప్రయాణికులకు రూ. 300 శీఘ్రదర్శన టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు.

దీన్ని భక్తులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మార్చి 18 వరకు టిఎస్ఆర్టిసి బస్సుల్లో వెళ్లిన 1,14,565 మంది ప్రయాణికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించిందని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ, సాధారణంగా వెళ్లే వారికి దర్శనానికి పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని టిఎస్ఆర్టిసి బస్సుల్లో తిరుమలకు వెళ్లాలని, తద్వారా శ్రీవారి దర్శనం త్వరగా అవుతుందని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news