తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 30 క‌రోనా కేసులు.. 500 లోపే యాక్టివ్ కేసులు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతుంది. ప్ర‌తి రోజు కూడా కింటి రోజు కన్న త‌క్కువ సంఖ్య‌లో కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ ఈ రోజు కరోనా వైర‌స్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 17,806 కరోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

ఈ ప‌రీక్షల‌లో రాష్ట్ర 30 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. అలాగే మ‌రో 827 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షల ఫ‌లితాలు రావాల్సింది. కాగ ఈ రోజు కూడా తెలంగాణ‌ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు వెలుగు చూడ‌లేదు. అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది క‌రోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో తెలంగాణ‌ రాష్ట్రలో 500 లోపే యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 492 క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news