ఖాతాదారులకు అలర్ట్‌.. నేడు, రేపు బ్యాంకులకు సెలవులు

-

బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకుల్లో ఇవాళ, రేపు ఖాతాదారుల సేవలు నిలిచిపోనున్నాయి. ఇవాళ అంబేద్కర్ జయంతి ఉండగా రేపు గుడ్ ఫ్రైడే పర్వదినం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

banks
banks

బ్యాంకులతో పాటు స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. మళ్లీ శనివారం అంటే ఏప్రిల్ 16వ తేదీన బ్యాంకులు తిరిగి తెరుచుకున్నాయి. ఇక ఆదివారం మళ్లీ బ్యాంకులకు సెలవు ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు అత్యవసర పనులు ఉంటే శనివారం బ్యాంకులో పని చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా పనులను సోమవారం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. ఇక ఏప్రిలో మాసంలో.. 23 వ తేదీ, 24 వ తేదీ కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కాబట్టి.. ఖతాదారులు.. అలర్ట్‌ అయి.. తమ తమ బ్యాంకు లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news