మరీ దారుణం: ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అంత్యక్రియలు…!

-

కరోనా వైరస్ తో మరణించిన వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల వైద్యులు సహా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా కనపడుతుంది. కరోనాతో చావు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలా కన్నా హీనంగా చూసే పరిస్థితి ఉంటుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా సరే సిబ్బందిలో మార్పులు రావడం లేదు. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.

dead body
dead body

ఎంజీఎంలో లో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కరోనాతో చనిపోయిన మహిళను బంధులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు చేసారు అధికారులు. తమ తల్లి చనిపోయిందని తెలుసుకుని డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు వెళితే లేదని చెప్పారు అధికారులు. మృతదేహాన్ని ఎక్కడా అంత్యక్రియలు చేశారో చెప్పలేదు. దీనితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్ కు చెందిన మహిళా ఈనెల 13న ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Read more RELATED
Recommended to you

Latest news