హైదరాబాద్‌లో నేడు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

-

ఇవాళ (జూన్ 27వ తేదీ 2024) బ్రకీద్‌ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బక్రీద్‌ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే ఈద్గాలు, దర్గాలు ఉన్న ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు  తెలిపారు. ఈ విషయం గ్రహించి ప్రత్యామ్నాయ మర్గాల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని వాహనదారులకు అధికారులు సూచించారు.

నగరంలోని మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాలను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా అనుమతిస్తామని చెప్పారు. ప్రార్థనల నిమిత్తం వచ్చే వారి వాహనాల పార్కింగ్‌ను నెహ్రూ జులాజికల్‌ పార్క్, అల్లాహో అక్బర్ మసీదు ఎదుట ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పాతబస్తీలో పలు మార్గాల్లో రాకపోకలను నిలిపివేస్తున్నామని.. అలాగే దాదాపు వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ సిటీ పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news