వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కి 10 సీట్లు కూడా రావు – మాజీ ఎంపీ వివేక్

-

వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు కూడా రావు అన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కామారెడ్డి లోని మద్నూర్ మండలం కోడిచెర్లలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల పాలయిందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు వివేక్.లక్షల కోట్లు అప్పు తెచ్చినా సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అవినీతి ప్రాజెక్టు అని అన్నారు. కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మించారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సిడబ్ల్యుసి అనుమతుల మేరకు జరగలేదన్నారు వివేక్. తప్పుడు డిసైన్ వల్ల లక్ష కోట్ల ప్రాజెక్టు వరద పాలయిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సియం కేసీఆర్ ని ప్రాసిక్యూట్ చేయాలన్నారు.బిజెపి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామన్నారు వివేక్.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చిన టీఆరెస్ కి 10 సీట్లు కూడా రావన్నారు.మునుగొడులో ఉప ఎన్నిక వస్తదని సియం ఇతర పార్టీల లీడర్లను కొంటున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news