KPHB ప్రేమ జంట ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌..భర్తకు విడాకులు ఇచ్చి !

-

KPHB ప్రేమ జంట ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీలోని ఏడవ ఫేజ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. భీమవరంలోని గొల్లోనితిప్ప ప్రాంతానికి చెందిన జ్యోతి, శ్యామ్ లు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. శ్యామ్ గొల్లోనితిప్ప లో ఫాస్టర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. జ్యోతి హైదరాబాద్ లో లేడీస్ హాస్టల్ ల్లో ఉంటుంది.

జ్యోతి వివాహిత, కొన్ని రోజుల కిందట విడాకులు తీసుకుంది. శుక్రవారం గొల్లోనితిప్ప నుండి నగరానికి వచ్చాడు శ్యామ్. కేపీహెచ్‌బీలోని ఏడవ ఫేజ్ లో ఉంటున్న తన స్నేహితుడికి‌ ఫోన్ చేసి‌ రూమ్ కావాలని అడిగాడు. తను ఊరెళ్ళానని, తన రూమ్ లో ఉండమని శ్యామ్ కి చెప్పాడు రామకృష్ణ. అయితే.. రామకృష్ణ రూమ్ కి వచ్చి జ్యోతిని పిలిపించుకున్న శ్యామ్.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రి శ్యామ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా, విషం తాగి ఆత్మహత్య చేసుకుంది జ్యోతి. ఈ రోజు వారి గది నుండి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం శ్యామ్, జ్యోతి లో మృతదేహాలను మార్చురీకి‌ తరలించి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news