హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ బంద్..!

-

హైదరాబాద్‌ లో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రెండు రోజులు వైన్స్ బంద్ చెయ్యాలని సీపీ ఆనంద్ ఉత్తర్వులు వారి చేసారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్స్, బార్, కల్లు కాంపౌడ్లు బంద్ చేయాలని పేర్కొన్నారు.

ఒకవేళ ఆదేశాలను ఎవరైనా ఉలంగిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు అని హెచ్చరించారు, అదే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు జంట నగరాల పరిధిలోని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్పెక్టర్‌లకు అధికారం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. అలాగే నిమజ్జనం కోసం దేవుణ్ణి తీసుకువచ్చే బండిలో కూడా ఎలాంటి మత్తు పదార్ధాలు కనిపించినా చర్యలు ఉంటాయి అని స్పష్తమ్ చేసారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news