భువనగిరి గురుకుల హాస్టల్‌లో దారుణం.. ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

-

భువనగిరి గురుకుల హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనగిరి పట్టణంలోని బీచ్ మహళ్లా ఎస్సీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.

two female students in the same room of the hostel

హాస్టల్ గదిలో ఈ ఘటన చోటు చేసుకోగా తోటి విద్యార్థినిలు.. గమనించి 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే వీరు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు భవ్య, వైష్ణవిలతో పాటు గదిలో ఉండే విద్యార్థులను, వీరి సహా విద్యార్థినుల నుంచి, ఉపాధ్యాయులను పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విద్యార్థుల ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news