ఇందిరమ్మ రాజ్యం రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ – పొంగులేటి

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇండ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం రాగానే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ, వృద్ధులకు 4000 ఆసరా పెన్షన్, 500 కే సిలిండర్ ఇస్తామని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని అన్నారు. మరో 90 రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. వైన్ షాప్ టెండర్లకు 15 రోజుల గడువు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. గృహలక్ష్మి పథకానికి కేవలం మూడు రోజులే గడువు ఇవ్వడం దారుణం అన్నారు. సీఎం కేసీఆర్ ఓ తుపాకి రాముడని, ఆయన మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news