దళితబంధు పథకం దేశాన్నే కదిలిస్తోంది – తలసాని

-

దళిత బంధు పథకం రానున్న రోజుల్లో దేశాన్ని కదిలిస్తుందని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ – బిజెపి నేతలు మాయమాటలతో ప్రజలలోకి వచ్చి డ్రామాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

45 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఒరగబెట్టిందో చెప్పాలన్నారు. కళ్ళముందే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్నా చూడలేని కాబోది పార్టీలు కాంగ్రెస్ – బిజెపి అని విమర్శించారు. బిజెపి పార్టీ ఆఫీస్ పక్కనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ను విమర్శించడం దయ్యాలు వేదాలను వల్లించినట్టు ఉందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news