Telangana: పురుగుల మందు తాగి మరో ఇద్దరు రైతుల బలవన్మరణం !

-

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య కేసులు పెరిగిపోతున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పురుగుల మందు తాగి మరో ఇద్దరు రైతుల బలవన్మరణం చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

two telangana farmers dies

సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లికి చెందిన పాల పరమేశ్ గౌడ్ (32) బ్యాంక్ రుణం తీసుకుని వ్యవసాయం చేస్తుండగా రుణం కట్టాలని బ్యాంక్ అధికారుల వేదింపులు తట్టుకోలేక ఈనెల 7న పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించాడు.

మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన తలారి బాలమణి (43) తనకున్న రెండు ఎకరాలు కాకుండా 6 ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేస్తుంది. ఆరు ఎకరాల పొలం ఎండిపోవడంతో ఈనెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

Read more RELATED
Recommended to you

Latest news