అమానుషం.. హైదరాబాద్లో మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం

-

చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళపై ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అధిక రక్తస్రావంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అనంతరం ఆ కీచకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మూసాపేట వై జంక్షన్‌ సమీపంలోని (బాలానగర్‌ నుంచి కూకట్‌పల్లి రోడ్డు) విష్ణుప్రియ లాడ్జి పక్కనున్న భవనంలో వ్యాపార సముదాయాలున్నాయి. ఆదివారం ఉదయం భవనం సెల్లార్‌లోని ఒక షట్టర్‌ ముందు గుర్తు తెలియని మహిళ (45) మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి వెళ్లి చూసేసరి.. మృతురాలి ఒంటిపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు తీవ్రస్థాయిలో రక్తస్రావమైనట్లు ఆనవాళ్లున్నాయి. సీసీ కెమెరాలను పరిశీలించగా.. పాతికేళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఆమెతో మాట్లాడటం కనిపించింది. తర్వాత ఆమెను బలవంతంగా సెల్లార్‌లోని షట్టర్‌ వద్దకు లాక్కెళ్లి కొంతసేపటి తర్వాత ద్విచక్ర వాహనంపై కూకట్‌పల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news