బీజేపీని బలి కా బక్రా చేస్తున్నారు – విజయశాంతి

-

బీజేపీని బలి కా బక్రా చేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి ఫైర్‌ అయ్యారు. నేటి బీజేపీ ధర్నాలు, అరెస్టులు అన్ని బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహనతో కూడిన డ్రామాలు అని ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయని ఆగ్రహించారు.

దీనిపై కొందరు మీడియా మిత్రులు హౌస్ అరెస్ట్లఉన్న నన్ను కూడా ఫోన్ ద్వారా ప్రశ్నలు అడిగినారని.. కేసీఆర్ గారు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఇట్ల బీజేపీని నష్టపరిచే ప్రయోగాలు, ప్రచారాలు ఎన్నో విధానాలుగా, ఎప్పటికెల్లో చేస్తున్నది వాస్తవం అంటూ మండిపడ్డారు.

ఈ అవగాహన ప్రశ్న పై, మమ్మల్ని అడిగినట్లే, కేసీఆర్ గారిని కూడా మాట్లాడమనడం తప్పక సమంజసం కాదు, బీజేపీని మాత్రమే బలి కా బక్రా చేస్తామనడం అసమంజసం అన్నారు విజయశాంతి. ఏది ఏమైనా, బీజేపీ తన సైద్ధాంతిక పంథాలో ఎప్పుడైనా కొనసాగుతూనే ఉండటం నిశ్చయంగా… నిరంతరం అంటూ పోస్ట్‌ పెట్టారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news