నేడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగాంగానే ఇవవాళ ఉదయం 7.30 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేయనున్న కిషన్ రెడ్డి…. ఉదయం 8.20 గంటలకు అంబర్ పేట లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.

ఉదయం 8.50 గంటలకు బషీర్ బాగ్ లోని కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించనున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. ఉదయం 9.20 గంటలకు లిబర్టీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. ఉదయం 9.40 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళలర్పిస్తారు. గన్ పార్క్ నుంచి నాంపల్లి పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి… 11.45 గంటలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర సారథిగా బాధ్యతలు స్వీకరించనున్నారు కిషన్ రెడ్డి. 12.15 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో యజ్ఞం కూడా నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news