ఎన్డీఏ, ఇండియా కూటములపై విజయశాంతి సంచలన పోస్ట్‌ !

-

ఎన్డీఏ, ఇండియా కూటములపై విజయశాంతి సంచలన పోస్ట్‌ చేశారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను జాతీయ కూటములు రెండు ( ఎన్డీఏ, ఇండియా ) సమాదరణతో స్పష్టం చెయ్యడం తప్పక అభినందనీయం అన్నారు. జాతీయవాదం ఎప్పటికీ సకల రాష్ట్రాల ప్రజల సమాహారమే అన్నది, వాజ్‌పేయి గారు ఎన్నడో నేర్పిన సూత్రం అని వ్యాఖ్యానించారు.

6 దక్షిణాది రాష్ట్రాల మనోభావాలు కూడా సమున్నతంగా గౌరవించబడే, కలైజ్ఞర్ గారు, ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, జయలలిత గారు, నేర్పిన ఆ విధానాన్ని, అవగాహనా ధోరణిని దేశ ప్రజలు తప్పక ఎప్పటికీ సరైనదిగా భావిస్తారని పోస్ట్‌ పెట్టారు విజయశాంతి. ఏమైనా, గత UPA పేరు తీసివెయ్యటంలోనే , కాంగ్రెస్ నేతృత్వ కూటమి వారిది కాదు అన్న సంకేతం తెలుస్తుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news