బీజేపీ, కాంగ్రెస్ కారణంగానే తెలంగాణ ఏర్పాటు – విజయశాంతి

-

బీజేపీ, కాంగ్రెస్ కారణంగానే తెలంగాణ ఏర్పాటు అయిందని బిజేపి పార్టీ నేత విజయశాంతి పేర్కొన్నారు. “కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నరు…” అని మంత్రి హరీష్ రావు గారు ఇప్పుడు అంటున్నరు.. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం అని వెల్లడించారు బిజేపి పార్టీ నేత విజయశాంతి.

vijayashanthi on chandrababu arrest
vijayashanthi on chandrababu arrest

ఐతే, బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చావు నోట్లో తల పెట్టి తెచ్చినది అబద్దం అంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చావు నోట్లో తల పెట్టి తెచ్చినది హాస్యాస్పదం అని చురకలు అంటించారు. సిఎం కేసీఆర్ గారు దీక్ష పేరుతో కథ చేసింది 2009ల… తెలంగాణా వచ్చింది 2014 లో అంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి. ఆ 2014 ల దొర గారు దీక్షలని చెప్పే దొంగ దీక్షలు ఏమీ చెయ్యలేదన్నారు. ఇగ, వారు చెప్పుకునే 2009 దీక్షా వ్వవహారానికీ తెలంగాణ ఏర్పాటుకు సంబంధం ఏమిటో అందరూ ఒకసారి అర్థం చేసుకుంటే మేలు అంటూ చురకలు అంటించారు బిజేపి పార్టీ నేత విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news