వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45 సీట్లు – విజయశాంతి సెటైర్లు

-

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన ఈ వ్యాఖ్యలపై విజయశాంతి సెటైర్లు పేల్చారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సర్వే ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 45, బీజేపీ 7, ఎంఐఎం 7 మిగిలిన 15 సీట్లు లలో త్రీవ్రమైన పోటీ ఉంటుందని బీజేపీ నేత విజయశాంతి పోస్టు పెట్టారు.

పై సర్వే నమ్మాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిచే ఆ సీట్లు ఏవో కూడా పీసీసీ తెలియజేస్తే ప్రజలకు అర్థం అయ్యే అవకాశం ఉందని చురకలు అంటించారు విజయశాంతి. లేదంటే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలలో వచ్చిన ఫలితాల దృష్ట్యా (పోయిన కాంగ్రెస్ డిపాజిట్స్), ఆ సర్వే ఆసమంజసమైన అంశంగా అందరు అనుకునే అవకాశమున్నదని విజయశాంతి సేటెర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news