కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వరంగల్ మేయర్ గుండు సుధారాణి ?

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒక్కో నాయకుడు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు లాంటి కీలక లీడర్లు పార్టీ మారగా… మరికొంతమంది కిందిస్థాయి లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

Warangal Mayor Gundu Sudharani met CM Revanth Reddy

అయితే తాజాగా గులాబీ పార్టీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. త్వరలోనే వరంగల్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి షాక్ ఇచ్చిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి…తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు వరంగల్ మేయర్ గుండు సుధారాణి. దీంతో ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news