ప్రజలు కౌశిక్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి : ఎమ్మెల్యే నాగరాజు

-

ప్రతిపక్ష నాయకులకు పై విరుచుకు పడ్డారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం.., వంగపహాడ్ గ్రామంలో నూతన భవనము, గోధుము,సి ఎస్ సీ సెంటర్ ప్రారంభానికి వచ్చారు వర్ధన్నపేట ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫామ్ హౌస్ లో ఉండడం లేదు, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎల్లప్పుడు ఫామ్ హౌస్ నుండి బయటికి రాకుండా ప్రజల గురించి పట్టించుకోలేదు. చక్కటి పాలన చేస్తున్న ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు BRS పార్టీ వాళ్లు చేస్తున్నారు.

ఫామ్ హౌస్ లో పండుకొని కేసీఆర్ డైరెక్షన్ ఇస్తున్నారు. ట్విట్టర్ టిల్లు అని అంటారు. ట్విట్టర్లో పోస్టులు చేయడం, ఫామ్ హౌస్ లో పండుకొని ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదు కేసీఆర్. మొన్న చూసాం కౌశిక్ రెడ్డి అనే మాదాపు ఏనుగు ఏ విధంగా హైదరాబాదులో అల్లార్లు చేపిస్తున్నాడో. ప్రజలు ఇలాంటి అల్లార్లకు కారణమవుతున్న వారికీ తగిన బుద్ధి చెప్పాలి అని అన్నారు ఎమ్మెల్యే నాగరాజు.

Read more RELATED
Recommended to you

Latest news