హైదరాబాద్‌కు వార్నర్ బ్రదర్స్ ‘డిస్కవరీ’ గ్రూప్‌

-

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆయన బుధవారం రోజున వార్నర్ బ్రదర్స్ డిస్కరవీ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్శ్(ఫైనాన్స్‌) అలెగ్జాండ్ర కార్టర్‌తో సమావేశమయ్యారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఇన్నోవేషన్‌పై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. హైదరాబాద్‌లో వార్నర్‌ బ్రదర్స్‌ కార్యాలయం ఏర్పాటుతో భారతదేశంతోపాటు నగర మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

‘‘హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఐడీసీ.. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ కార్యకలాపాలకు వ్యూహాత్మక హబ్‌గా ఉంటుంది. ఐడీసీ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలో 1200 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తదుపరి వ్యాపారాభివృద్ధి మేరకు కార్యకలాపాల విస్తరణ ఉంటుంది’’ అని కేటీఆర్‌ వివరించారు. దీంతో అంతర్జాతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ గ్రూప్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news