యూపీఐ యాప్స్ తో వేరొకరికి డబ్బులు పంపారా? ఇలా చేస్తే ఈ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి..

-

కరోనా తర్వాత అందరు ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. 2016లో డీమోనిటైజేషన్ తర్వాత ఏటీఎంల వద్ద రద్దీని నియంత్రించడానికి ఆన్‌లైన్ చెల్లింపులు సులభమైన ప్రత్యామ్నాయంగా మారాయి.. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు సౌకర్యవంతంగా, సులభంగా మారాయి. అయితే ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ ఒకరికి పంపాల్సిన సొమ్ము ఇంకొకరికి పంపితే మాత్రం కొంత ఇబ్బందిగా మారుతున్నాయి..

 

ముఖ్యంగా యూపీఐ చెల్లింపులు ద్వారా పేమెంట్ చేసే వారు రెండు సాధారణ తప్పులు చేస్తున్నారు. వేరే వ్యక్తి సొమ్మును పంపడం ఒకటైతే.. పంపాల్సిన సొమ్ము కంటే ఎక్కువ పంపడం మరో తప్పుగా ఉంటుంది.. అలా చేస్తే డబ్బులు పొయ్యాయి.. వాళ్లు ఇస్తారో లేదో అని అనుకుంటారు..ఆ డబ్బులను తిరిగి పొందవచ్చునని అంటున్నారు..అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యూపీఐ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే మన సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చేసిన లావాదేవీ వివరాలను తెలిపి ఫిర్యాదు చేయాలి. అలాగే మన సొమ్ము డెబిట్ అయిన బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కూడా కాల్ చేసి తప్పుడు లావాదేవీ గురించి ఫిర్యాదు చేయవచ్చు. అయితే తప్పుగా చెల్లించిన పక్షంలో ఫిర్యాదు చేసిన 48 గంటల్లోపు డబ్బును వాపసు చేయవచ్చని ఆర్‌బీఐ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.. అయితే మీరు డబ్బులను పంపిన మూడు రోజుల్లోపే ఫిర్యాదు చెయ్యాల్సి ఉంటుంది..

యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా తప్పు బ్యాంక్ ఖాతాకు చెల్లింపు జరిగినప్పుడు 18001201740కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత, సంబంధిత బ్యాంకుకు వెళ్లి, దానిలోని మొత్తం సమాచారంతో ఒక ఫారమ్‌ను పూరించి సాయం పొందవచ్చు. అయితే బ్యాంక్ సహాయం చేయడానికి నిరాకరిస్తే, దాని గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు సమయంలో అవసరమైన పీపీబీఎల్ నంబర్‌ ఉండాలి.. డబ్బులు పంపినట్లు ఉండే మెసేజ్ ను డిలీట్ చెయ్యకూడదు..

ఎన్‌పీసీఐ వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు తప్పు లావాదేవీ గురించి ఫిర్యాదు చేయవచ్చు. రిసీవర్ యూపీఐ ఐడీ, వారి ఫోన్ నంబర్, బదిలీ చేయబడిన మొత్తం, మీ ఖాతాకు సంబంధించిన యూపీఐ పిన్‌ను నమోదు చేసేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. వీటిలో ఏదైనా తప్పు జరిగితే మీరు రిసీవర్‌కు తప్పుడు మొత్తాన్ని పంపడం లేదా సరైన మొత్తాన్ని తప్పు వ్యక్తికి పంపడం వంటి వాటి ద్వారా అనవసరంగా మన డబ్బును కోల్పోవచ్చు.. అందుకే ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news