రావాల్సిన నిధులను కేంద్రాన్ని అడుగుతున్నాం.. మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఫెడరల్ సిస్టమ్ స్ఫూర్తితో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులనే తాము అడుగుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సెక్రటేరియట్లోని మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులగా బాధ్యతలు స్వీకరించిన కిషన్రెడ్డి, బండి సంజమ్లకు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించేలా చూడాలన్నారు. గతంలో వారికి రాష్ట్ర సహకరించలేదని సాకు చెప్పకుండా.. అన్ని విషయాలు చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

హైదరాబాద్ మహానగరానికి మెట్రో వాటర్ వర్క్స్, మౌలిక సదుపాయాల కల్పన, చెరువుల అభివృద్ధి, 141 వాటర్ బంధించిన నిధుల త్వరగా కేటాయించేలా చొరవ లాగింగ్ పాయింట్స్పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం తోడ్పాటునందిచాలని అన్నారు. అదేవిధంగా మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు అంశాలపై రాష్ట్రానికి న్యాయం చేయాలని అన్నారు తెలంగాణలోని అన్ని జిల్లాలకు న్యాయం జరిగేలా ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూళ్లుచ బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా సామన్యులను దృష్టిలో పెట్టుకుని నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news