ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి.. అంబేద్కర్ పెడతాం : సీఎం రేవంత్ రెడ్డి

-

తుమ్మిడి హట్టిలో  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి.. అంబేద్కర్ పెడతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్ లో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు. పదేండ్లు మనల్ని ఏలిన కేసీఆర్, నరేంద్ర మోడీ పేదలకు ఏం చేయలేదన్నారు. 3 నెలలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలంటున్నారు. మోడీ, కేడీ కలిసి ఆదిలాబాద్ ని నిర్లక్ష్యం చేశారు.

తమ ప్రభుత్వంలో ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమ నిర్మించామని గుర్తు చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని కేసీఆర్ రద్దు చేశారు. పదేండ్లు పవర్ లో ఉండి ఏం చేయని బీఆర్ఎస్, బీజేపీని ఏం చేయాలని ప్రశ్నించారు. త్వరలోనే రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. కుప్టి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఆదిలాబాద్ ని సస్యశ్యామలం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news