వందశాతం పంట నష్టం అందజేస్తాం : మంత్రి జూపల్లి

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈర్లపల్లి శంకర్ తో కలిసి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు కరెంట్ ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు.. పదేళ్లలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు.

పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇవ్వలేదని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహణ చేస్తే ఇప్పుడు సాగునీటి కష్టాలు వచ్చేవి కావని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై దృష్టి పెట్టారు తప్పా.. ప్రజల కోసం ఏనాడూ ఆలోచించలేదని చెప్పారు. పంట నష్టం జరిగిన రైతులకు అందరికీ వందశాతం అకౌంట్లో నగదు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. గడిచిన పదేళ్లలో ఏనాడూ పంటనష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ఆదుకోలేని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు

Read more RELATED
Recommended to you

Latest news