తెలంగాణ గడ్డపైన టీడీపీని మళ్ళీ నిర్మిస్తాం – చంద్రబాబు

-

తెలంగాణ గడ్డపైన పుట్టిన పార్టీ టీడీపీని మళ్ళీ నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. యువరక్తాన్ని ఎక్కిస్తా పార్టీకి.. తెలంగాణలో త్వరలోనే పార్టీ నిర్మాణం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు 70,80 దేశాల్లో తెలుగు వాళ్ళు రోడ్డెక్కి నిరసనలు తెలిపారని తెలిపారు.

ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని అన్నారు.

ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. ఏపీలో విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. నన్ను జైల్లో పెట్టినపుడు తెదేపా శ్రేణులు చూపించిన చొరవ మరువలేను. ప్రపంచంలోని చాలా దేశాల్లో నా అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news