Ys Sharmila: నేడు ఇడుపులపాయకు రానున్న షర్మిల

-

Ys Sharmila:  నేడు కడప జిల్లా ఇడుపులపాయకు రానున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఇవాళ రాత్రికి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు వైఎస్‌ షర్మిల. ఇక రేపు వైయస్ జయంతి సందర్బంగా ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైయస్ ఆర్ సమాధివద్ద నివాళులు అర్పించనున్నారు షర్మిల. అనంతరం విజయవాడకు పయనం అవుతారు.

Ys Sharmila

ఇక అటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం రోజున ఏపీలో పర్యటించనున్నారు. జులై 8వ తేదీన విజయవాడకు వెళ్లనున్న ఆయన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. ఆయన వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళ్లనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం, మంత్రులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ఆమె ఇటీవల వరుసగా ముఖ్యమంత్రి, మంత్రులను వేర్వేరుగా ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు. మరో వైపు శనివారం రోజున ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news