ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్ లో రాస్తాం – రేవంత్ రెడ్డి

-

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారని.. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్ లో రాస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టమన్నారు.

ప్రభాకర్ రావు, రాధ కిషన్ రావు, భుజంగ రావు, నర్సింగ్ రావు లాంటి అధికారులనే తాను అనేది అని స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేసే అధికారులపై తనకెప్పుడూ గౌరవం ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని అంటున్న వాళ్ల విషయంలో సైలెంట్ గా ఎలా ఉంటామన్నారు. అధికారులకు రాజకీయాలతో ఎం సంబంధం..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news