ఈ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తాం – ఎమ్మెల్సీ కవిత

-

ఈ ఎన్నికల్లో 119 స్థానాలలో 100కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసిఆర్ అని.. మరి కాంగ్రెస్, బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.

వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ మాత్రమే సరిపోతుందన్న కాంగ్రెస్ కావాలా..? లేక 24 గంటల విద్యుత్ అందిస్తున్న బీఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచించుకోవాలన్నారు. బిజెపి ప్రభుత్వం బడా బాబులకు 15 వేల కోట్లు మాఫీ చేసి, రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. 160 కోట్లతో మంచినీటి ఆర్మూర్ ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news