చూసిన బ్యారేజీనే మళ్లీ ఏం చూస్తారు : ఎంపీ బండి సంజయ్

-

పాక్షికంగా దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీని మళ్లీ పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చూసిన బ్యారేజీనే మళ్లీ ఏం చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ పై అధికారులు సమగ్ర నివేదికను అందజేశారని గుర్తు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే మాజీ సీఎం కేసీఆర్ పై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. కృష్ణా జలాల సమయంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఆటలాడుతున్నాయని.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పరిపాలనను గాలికి వదిలి అధికారులు ఇచ్చిన మేడిగడ్డ రిపోర్టు ఆదారంగా కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తీ తెలిసిపోతుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా అటు బీఆర్ఎస్ నాయకులు నల్గొండ సభకు, కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డకు వెళ్లారని ఎద్దేవా చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news