మార్కెట్లోకి విస్కీ ఐస్ క్రీమ్.. ఎగబడుతున్న పిల్లలు..!

-

విస్కీ తో ఐస్ క్రీం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసారు పోలీసులు అయితే
ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతుంది ఓ ముఠా. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1, 5 లో ఉన్న అరికో ఐస్ క్రీం పార్లర్ పై తాజాగా ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వీరి బండారం బయట పడింది. ఐస్ క్రీమ్ లో 100 పైపర్ విస్కీ కలిపి అమ్మకాలు చేస్తున్నారు. అయితే ఈ విస్కీ పేపర్ ఐస్ క్రీమ్ కోసం పిల్లలు, యువత ఎక్కువగా ఎగబడ్డారు. దానికి అలవాటు పడిపోయి ఎక్కువగా ఈ విస్కీ ఐస్ క్రీమ్ తినడం ప్రారంభించారు.

దాంతో కేటుగాళ్లు జేబుల్లో డబ్బులు చేరడం ప్రారంభించారు. అయితే ఒక కిలో ఐస్ క్రీం లో కేటుగాళ్లు 60ml విస్కీ కలుపుతున్న అధికారులు తెలిపారు. ఈ విస్కీతో ఐస్ క్రీమ్ తయారు చేసి అరికో పార్లల్ సంస్థ అమ్ముతుంది. దీంతో పార్లర్ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్ ను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news