TRS ఎమ్యెల్యేలు బట్టేబాజ్ గాళ్ళు ? – వైఎస్ షర్మిల

-

TRS ఎమ్యెల్యేలు బట్టేబాజ్ గాళ్ళు ? అంటూ వైఎస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ MLA మదన్ రెడ్డి ఇసుక, భూ మాఫియాలకు కేరాఫ్ అట. కల్యాణలక్ష్మి రాలేదని లబ్ధిదారుడు ప్రశ్నిస్తే.. బట్టేబాజ్ అని తిడతాడట అంటూ ఫైర్ అయ్యారు. జైలులో వేయాలని చెబుతాడట. మరి ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చని నిన్ను, ఎన్నిసార్లు బట్టేబాజ్ అనాలి? ఎన్నిసార్లు లోపలేయాలి ? అని నిలదీశారు వైఎస్ షర్మిల.

కేసీఆర్ గారు రూ.300 చీరె ఇచ్చి, మూడు తరాల పాపాలను కడిగేసుకోవాలని చూస్తున్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు లేవు. కరెంట్ చార్జీలు పెరిగాయి. ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. నిత్యావసర ధరలు పెరిగాయి. ఈ పాపాలను కడిగేసుకోవాలనే చీరెలు పంచుతున్నారని అగ్రహించారు. వైయస్ఆర్ గారు ప్రజల కోసమే జీవించారు. ప్రజల కోసమే మరణించారు. నేడు అలాంటి నాయకుడే లేడు. వైయస్ఆర్ సంక్షేమ పాలన పూర్తిగా మరుగునపడింది. అందుకే వైయస్ఆర్ బిడ్డ YSR తెలంగాణ పార్టీ పెట్టిందన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news