తెలంగాణలో మళ్లీ భారీగా నమోదైన కరోనా కేసులు

-

యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 29,084 కరోనా పరీక్షలు నిర్వహించగా, 493 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 366 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 219 మంది కరోనా నుంచికోలుకున్నారు.

New variant of Corona detected in India

కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 7,98,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా…7,90,692 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3 వేలు దాటింది. రాష్ట్రంలో ఇంకా 3,322 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.

 

Read more RELATED
Recommended to you

Latest news