తెలుగు సినిమా లెజెండ్స్ మనల్ని విడిచి వెళ్ళిపోయారు..!!

-

సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు ప్రేక్షకులను కలచి వేస్తోంది. తన నటనతో ఎన్నో చిత్రాల లో నటించి ప్రేక్షకులను అలరించారు. తన నటనతో పాటు తన వ్యక్తిత్వం తో దైర్యం తో ఎంతో మంది అభిమానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ , నాగేశ్వరరావు హీరోలు గా ఫుల్ జోష్ లో ఉన్న కాలంలో జూనియర్ గా కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టారు.

కృష్ణ, తో పాటు, కృష్ణం రాజు, శోబన్ బాబు కూడా సినిమా పరిశ్రమ లోకి వచ్చారు.ఎన్టీఆర్ , నాగేశ్వరరావు లను కొంచెం సీనియర్స్ గా గౌరవించే వారు.కాని కృష్ణ, కృష్ణం రాజు, శోబన్ బాబు ముగ్గురు మాత్రం ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. వారిద్దరితో కలసి చాలా సినిమాల లో నటించే వారు. వీరు షూటింగ్ తర్వాత కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఎలాంటి ఇగోస్ లేకుండా ఉండేవారు.

ఇక వీరి జనరేషన్ లో సూపర్ స్టార్ కృష్ణ మరణం తో పూర్తిగా కనుమరుగు అయ్యింది. పంచ పాండవులు గా చెప్పుకొనే వీరిలో ఎన్టీఆర్ 1996లో చనిపోయారు. శోభన్ బాబు గారు 2008 లో చనిపోతే, అక్కినేని నాగేశ్వరరావు గారు 2014లో, కృష్ణం రాజు రెండు నెలల క్రితం చనిపోయారు. ఇక కృష్ణ మరణం తో ఆ తరం జ్ఞాపకాలు మొత్తం కనుమరుగు అయిపోయాయి. ఆ కాలం ప్రేక్షకులు, అభిమానులు ఆ రోజులను తలుచుకొని రోదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news