బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత.. రాళ్ళు, కోడి గుడ్లతో దాడులు !

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శేట్టిపాలెం మహాతేజ రైస్ మిల్ కు కాసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా బండి సంజయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేసారు టీఆర్ఎస్ శ్రేణులు.

బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు టిఆర్ఎస్ నాయకులు. అయితే టిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు చెదరగొట్టారు. అయినప్పటికీ బండి సంజయ్ కి వ్యతిరేకంగా టీఆరెస్ శ్రేణులు నినాదాలు చేశారు. అంతే కాదు పరస్పరం రాళ్లు, గుడ్లు రువ్వుకున్నారు ఇరు పార్టీ శ్రేణులు. పోటాపోటీ నినాదాలతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. సీఎం రైతుల పట్ల గజిని గా మారాడని.. ఒకసారి పత్తి వేయమని, ఒక సారి ధాన్యం వెయ్యమని, మరోసారి వద్దని రైతులను తప్పుదారి పట్టిస్తున్నాడని ఈ సందర్భంగా బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గతంలో ప్రతి గింజ నేనే కొంట అని ఇపుడు మాట మారుస్తుండని.. ఇపుడు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొంటే చాలు అని ముఖ్యమంత్రి కెసిఆర్ ను డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news