దేశ రాజధానిలో కీలక ఉగ్రవాది అరెస్ట్

-

దేశ రాజధాని ఢిల్లీలో కీలక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. గత 19 సంవత్సరాలుగా పరారీలో ఉన్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 58 ఏళ్ల నిందితుడు, అబ్దుల్లా డానిష్, సిమి అనే ఉగ్రవాద సంస్థలో కీలక ఉగ్రవాది అని వెల్లడించారు. దేశ రాజధానిలో దేశద్రోహానికి పాల్పడ్డాడని స్పెషల్ సెల్ సీనియర్ పోలీసు అధికారి ప్రమోద్ సింగ్ కుష్వా ఒక ప్రకటనలో తెలిపారు
.
“గత 25 సంవత్సరాలలో చాలా మంది యువ ముస్లింలకు ఉగ్రవాద పాఠాలు బోధించాడు అని పోలీసులు పేర్కొన్నారు. అతను సిమి పత్రిక ‘ఇస్లామిక్ మూవ్మెంట్’ కు చెందిన హిందీ వెర్షన్ కు చీఫ్ ఎడిటర్గా నాలుగు సంవత్సరాలు పనిచేశాడు” అని పోలీసులు తెలిపారు. అబ్దుల్లా డానిష్ ఉత్తరప్రదేశ్‌లోని మౌ నివాసి. యూపీలోని అలీగర్ లో కూడా అతనికి ఇల్లు ఉందని పోలీసులు పేర్కొన్నారు. అతన్ని మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news