జ‌మ్మూకాశ్మీర్‌లో దారుణం: ఇద్ద‌రు టీచర్ల‌ను కాల్చిచంపిన ఉగ్ర‌వాదులు

-

దేశ బార్డర్‌ అయిన కశ్మీర్‌ లో మరోసారి ఉగ్ర వాదులు రెచ్చిపోయారు. మొన్నటి వరకు ఆర్మీ, పోలీస్‌ బలగాలను టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులు.. ఇప్పుడు మరో కొత్త పంథాను ఎంచుకున్నారు. సామాన్య ప్రజలను కూడా బలి తీసుకునేందుకు వెనకడటం లేదు ఈ ఉగ్ర మూకలు. రెండు రోజుల క్రితం ముగ్గురు పౌరులను కాల్చి చంపిన ఘటనలను మరువక ముందే.. తాజాగా మరోసారి శ్రీ నగర్‌ లో రెచ్చి పోయారు ఉగ్రవాదులు.

గురువారం ఉదయం ఓ పాఠశాలలో చొరబడి బీభత్సం సృష్టించారు ఉగ్రవాదులు. ఉగ్రవాదుల కాల్పుల్లో స్కూల్‌ ప్రిన్సిపాల్ తో పాటు మరో ఉపాధ్యుడు మృతి చెందారు. శ్రీ నగర్‌ లోని సఫాకాదాల్‌ ప్రాంతంలోని ఓ స్కూల్‌ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్కూల్‌ లోకి ఆయుధాలతో చొరబడిన ఉగ్ర మూకలు.. సతిందర్‌ కౌర్‌ మరియు దీపక్‌ చాంద్‌ అనే ఇద్దరు ఉపాధ్యాయులపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి ఎస్కేప్‌ అయ్యారు ఉగ్రవాదులు. ఇక ఉపాధ్యాయులు ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news