ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీదే విజయం…. హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్ర ప్రదేశ్ లో సీట్ల సర్దుబాబు సక్రమంగా జరిగితే తెలుగు దేశం పార్టీ, జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీనటుడు సుమన్ అన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తనకు రాజకీయ గురువని నటుడు సుమన్ చెప్పారు.

సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ-జనసేన గెలుపు ఖాయం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా ఆలోచించి ఓటేయాలి కోరారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఇప్పుడు నాకు లేదు అని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో బాపట్ల ఎంపీగా చంద్రబాబు పోటిచేయమన్నారని…. అందుకు తాను చంద్రబాబుకు ధన్యావాదాలు చెబుతున్నానన్నారు.తమిళనాడులో హీరో విజయ్ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా’ అని పేర్కొన్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news