అందుకే నరేష్.. పవిత్రను వాడుకుంటున్నాడు.. కృష్ణకుమారి..!!

-

పవిత్ర లోకేష్.. వీకే నరేష్ ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు పవిత్ర లోకేష్, నరేష్ మధ్య ఉన్న బంధం ఏమిటో ఏ ఒక్కరికి తెలియకపోయినా వీరిద్దరి మధ్యలోకి రమ్య రఘుపతి కూడా చేరి రోజురోజుకి కథ తారస్థాయికి చేరుతోంది.. నిజానికి పవిత్రలోకేష్ .. సుచెంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. వీరికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. ఇక నరేష్ ఆల్రెడీ రెండు వివాహాలు చేసుకుని వారికి విడాకులు ఇచ్చాడు. ఇక మూడవ భార్య రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నాడు కానీ ఇంకా విడాకులు ఇవ్వలేదు.. ఈ క్రమంలోనే తన భర్తను పవిత్ర లోకేష్ ఏమో చేయబోతోంది అనే ఆలోచనతో వారిద్దరిపై మరిన్ని రూమర్స్ సృష్టించి రమ్య చెలరేగిపోతోంది. ఇక కన్నడ మీడియాకు వెళ్లి మరీ వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలియాల్సి ఉంది అంటూ మీడియా ముందు చాలా రచ్చ చేసింది.

కానీ పవిత్ర లోకేష్ , నరేష్ ఇద్దరూ కూడా విడివిడిగా మీడియా ముందు రమ్య డబ్బు కోసమే ఇదంతా చేస్తోందంటూ చెప్పారు. కానీ వీరి ముగ్గురి మధ్య ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోగా రోజు రోజుకి ఒక సినిమా లాగా అనిపిస్తోంది.. ఇక వీరి ముగ్గురి వ్యవహారంపై పలువురు ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా చర్చించడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే సామాజికవేత్త కృష్ణకుమారి కూడా స్పందించారు.. అంతేకాదు వీరి ముగ్గురికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆమె మీడియా ముందు వెల్లడించడం గమనార్హం. కృష్ణకుమారి మాట్లాడుతూ నరేష్ కి అతడి మూడో భార్య రమ్య రఘుపతికి చాలా రోజుల నుండి పడడం లేదు.. ఇద్దరు కూడా విడాకులకు అప్లై చేశారు కానీ ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా.. ఇప్పుడు వీరి మధ్యలోకి పవిత్ర రావడంతో అసలు కథ మొదలైంది..

పవిత్ర లోకేష్ మాత్రం మేమిద్దరం సహజీవనం చేస్తున్నాము.. కృష్ణ గారి కుటుంబం సపోర్టు కూడా ఉంది రమ్యతో విడాకులు తీసుకున్నాక నరేష్ ను వివాహం చేసుకుంటాను అనే లాగా ఆమె మాట్లాడడమే కాదు నరేష్ చేత కూడా ఆమె మాట్లాడించారు. రమ్య తన దగ్గరికి వచ్చి.. విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలన్నది నరేష్ ప్లాన్. ఇందుకోసమే పెద్ద రచ్చ చేసి పవిత్ర లోకేష్ ను అడ్డం పెట్టుకొని నరేష్ నెమ్మదిగా జారుకుంటాడు.. రమ్యతో విడాకులు తీసుకోవాలని భావిస్తున్నాడు కాబట్టి ఇలా పవిత్ర లోకేష్ ను వాడుకుంటున్నాడు అంటూ కృష్ణకుమారి తెలిపింది. మరొకవైపు నరేష్ ను ఇరికించడానికి ఎప్పుడు దొరుకుతాడా అంటూ ఆమె కూడా ఎదురు చూసింది.

ఇక మైసూర్ లో ఒకే హోటల్ గదిలో నరేష్ , పవిత్ర పోలీసులకు దొరికినప్పుడు పవిత్రని చెప్పుతో కొట్టడానికి ప్రయత్నం చేసింది కానీ నరేష్ తన భర్త కాబట్టి ఎందుకు అతడితో గొడవ పడలేదు అంటూ రమ్యని కూడా ప్రశ్నించింది కృష్ణకుమారి. ఒకవేళ వివాహేతర సంబంధం వల్ల భాగస్వామి మానసికక్షోభకు గురైతే గృహా హింస చట్టం కింద వస్తుంది.. ఇద్దరికీ విడాకులు తీసుకోవడం సుముఖమే అయితే కట్నం కింద లెక్కలు తేలాల్సి ఉంటుంది అది క్లియర్ అయిన తర్వాతనే విడాకులు తీసుకోవాలి అంటూ ఈ విషయాన్ని రమ్య మీడియా ముందు చెప్పినట్లు కృష్ణకుమారి మరొకసారి గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news