అందుకే ప్రియాంక చోప్రా కూతురిని చూపించలేదా?

-

బాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతురు మాల్తీ గురించి సంచలన విషయాలను బయట పెట్టింది..ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మడు సరోగసి విధానం ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో వివరిస్తూ ఎమోషనల్‌ అయ్యింది. ”మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్‌ థియేటర్‌లోనే ఉన్నాను. ఆమె నా చేయికంటే చాలా చిన్నగా ఉంది. దీంతో కొన్నిరోజుల పాటు ఆమెను ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో డాక్టర్ల పర్యవేక్షనలో ఉంచామని ఆమె చెప్పింది..

నిజంగానే దేవుళ్ళు డాక్టర్లు.. నా కూతురు బతికి బయటపడుతుందని కూడా అనుకోలేదు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసిని ఎంచుకున్నాం. కానీ నేనేదో అందం తగ్గుతుందని సరోగసిని ఎంచుకున్నానని మాట్లాడినప్పుడు చాలా బాధనపించింది. సోషల్‌ మీడియా లో వచ్చే ట్రోల్స్‌ తాలూకు ప్రభావం నా బిడ్డపై పడకూడదని నిర్ణయించుకున్నా. అందుకే తన ఫోటోలు కూడా రివీల్‌ చేయడం లేదు. ఇక సరోగసీ అంత కాదు.

ఆ పని కోసం  సుమారు ఆరునెలల పాటు నేను, నా భర్త చాలా వెతికాం. చివరకి ఓ దయగల మహిళ సరోగసికి ఒప్పుకుంది. అందుకే నా కూతురికి నాతో పాటు ఆమె పేరు కూడా కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతేడాది జనవరిలో నిక్‌-ప్రియాంక దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్‌ అయిన సంగతి తెలిసిందే..ఇప్పుడు ప్రియాంక అడపాదడపా సినిమాలు చేస్తుంది.. ఒక్క ప్రియాంక మాత్రమే కాదు చాలా హీరోయిన్లు ఈ విధానం ద్వారానే తల్లి దండ్రులు అయ్యారు..

Read more RELATED
Recommended to you

Latest news