అందుకే వారసుడు సినిమాని వాయిదా వేసా.. దిల్ రాజు..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో దిల్ రాజు కూడా ఒకరు. ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేసి మంచి విజయాలను అందుకున్నారు. అయితే గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఎక్కువగా దిల్ రాజు పేరు బాగా వైరల్ గా మారుతోంది. అందుకు కారణం ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న కొన్ని చిత్రాల కారణంగా వైరల్ గా మారారు. ఇక ఈనెల 11న విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాని విడుదల చేయవలసి ఉన్నది.

కానీ తాజాగా ఈ చిత్రం వాయిదా వేసినట్లుగా నిన్నటి రోజున దిల్ రాజు తెలియజేయడం జరిగింది. తమిళంలో ఈనెల 11న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రాన్ని ఈనెల 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ లో దిల్ రాజు అసలు విషయాన్నీ తెలియజేయడం జరిగింది. తెలుగులో చిరంజీవి , బాలకృష్ణ నటించిన వాల్తేర్ వీరయ్య , వీరసింహారెడ్డి సినిమాలు భారీగా విడుదలవుతూ ఉండడంతో థియేటర్ల సమస్య ఉండకూడదనే కారణం చేతనే తను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేశారు.

దీనిపై పెద్దలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలియజేయడం జరిగింది దిల్ రాజు. విజయ్ సరసన హీరోయిన్ రష్మిక నటించింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ నటులతో పాటు శ్రీకాంత్, సంగీత కూడా నటిస్తున్నారు. ఇక కొంతమంది తనను అడిగారని 11 న అక్కడ విడుదల చేసి 14న ఇక్కడ విడుదల చేస్తే సినిమా బయటికి వచ్చేస్తుంది కదా అని అడగగా.. నాకు సినిమా మీద నమ్మకం ఉంది. కాబట్టే ఇలా చేశానని చెప్పారు దిల్ రాజు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news